రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభత్వం ఎంతో చిత్త శుద్దితో పని చేస్తుందని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. మండల పరిధిలోని మిట్ట బాసుపల్లి, గుంత బాసుపల్లిలో మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ..సీ.ఎం కే. సీ.ఆర్ రైతు పక్ష పాతి అని అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికలు, రైతుల కోసం పొలాల్లో కల్లాల నిర్మాణం లాంటివి చేపడితున్నట్లు వివరించారు. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల కోసం అవసరమైన వసతుల కల్పన, దళారుల నుంచి రక్షణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వ్యవస్థ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో చేపడుతున్నట్లు తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి గాను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, మార్కెట్ అభివృద్ధికి పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు.
సన్మానంలో వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, డైరెక్టర్లు భీమ్ రెడ్డి, సాయి రెడ్డి, మల్లప్పలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నరేందర్ రెడ్డి, జగదీష్, టీ.ఆర్.ఎస్ మండల నాయకులు స్వరూప రెడ్డి, గౌతపూర్ ఎం.పీ.టీ.సీ ఉమ శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు రాందాస్, రామలింగ రెడ్డి, రాజు పటేల్, శ్రావణ్ తదితరులు ఉన్నారు.