26.7 C
Hyderabad
May 15, 2024 09: 44 AM
Slider గుంటూరు

ముస్లింలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

m d gafoor

ఇంతకాలం ముస్లింలను ఓటు బ్యాంకుగా చూశారు తప్ప రాజకీయంగా పదవులు కల్పించలేదని పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎండి గఫార్ అన్నారు. రాష్ట్రంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు రాజకీయ పదవులు ఇస్తున్నారని ఆయన అన్నారు.

నేడు గుంటూరు వచ్చిన ఆయన గుంటూరు జిల్లా గురజాల కు చెందిన రాష్ట్ర వైయస్సార్ సి పి అదనపు కార్యదర్శి  మురళీధర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు.  పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితుడైనట్లు చెప్పిన ఎండి గఫార్ మార్చి 2వ తేదీన జరిగే  ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు. ఈ సందర్భంగా గఫార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ముస్లింలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

పల్నాడు చరిత్రలోనే కాకుండా 70 సంవత్సరాల గతంలో అన్ని ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకు గానే చూసాయని వైఎస్సార్  ప్రభుత్వంలో ముస్లింలకు బిసి. ఎస్సీ. ఎస్టీలకు అత్యుత్తమ పదవులు ఇచ్చి వారు రాజకీయంలో రాణించడానికి దోహదపడుతున్నదని ఆయన అన్నారు.

Related posts

నోముల మృతి తీర‌ని లోటు

Sub Editor

రైతులు మై ట్రాక్టర్ ఇండియా సేవలను వినియోగించుకోవాలి

Satyam NEWS

ఇంటింటి ప్రచారంలో భువన్ కుమార్ రెడ్డి బిజీ

Satyam NEWS

Leave a Comment