33.7 C
Hyderabad
April 29, 2024 23: 25 PM
Slider ఖమ్మం

నష్టపోయిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు మంజూరుచేయాలి

#CPM

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఖమ్మం మున్నేరు ప్రాంతంలోని వెంకటేశ్వర నగర్ కాలువ ఒడ్డు ప్రాంతం బొక్కల గడ్డ, మంచిగంటి నగర్, మోతీ నగర్, అగ్రహారం కాలనీ తదిత ప్రాంతాలు వరద ముంపుకు గురై వందలాది ఇల్లు నీట మునిగి కొన్ని ఇల్లులు కూలిపోగా అనేక ఇళ్లలోని వస్తువులు మున్నేటి ప్రవాహానికి కొట్టుకొని పోయాయి ఉన్న కొన్ని వస్తువులు పాడైపోయాయి, ఇండ్లలో బురద పేరుకుపోయింది చాలా దయనీయ పరిస్థితులలో ఈ కుటుంబాలు ఉన్నాయి.

సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం మున్నేరు ప్రవాహం కారణంగా నీట మునిగిన ప్రాంతాలను పర్యటన చేయడం జరిగింది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే దానిలో సహకరించడం జరిగింది మున్నేరు ప్రవాహం వల్ల నిరాశ్యులైన ప్రజలకు వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి వీరిని ప్రభుత్వం వెంటనే ఆదుకుని తగిన ఆర్థిక సహకారం అందించాలని ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని సిపిఎం కోరుతుంది, ప్రజా ప్రతినిధులు ఖమ్మం ఎమ్మెల్యే జిల్లా మంత్రి,జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేసింది.

Related posts

శరవేగంగా కర్రి బాలాజీ “బ్యాక్ డోర్” మూవీ

Satyam NEWS

ఒక్కసారిగా కుప్పకూలిన గోల్డ్ మైన్.. 18 మంది మృతి

Sub Editor

అంచనాలకు మించి ‘వాల్తేరు వీరయ్య’

Satyam NEWS

Leave a Comment