వనపర్తి జిల్లా పోలీస్ అడిషనల్ ఎస్పీ రాందాస్ తేజ ఉద్యోగ భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తికి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి కలిశారు. ఎసిపిగా రాందాస్ తేజ గతంలో హైద్రాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ ఏసీబీ డిఎస్పీగా విధులు నిర్వర్తించి ఇటీవల అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొంది వనపర్తి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కరించే దిశగా హామీ ఇస్తూ బాధితులకు ధైర్యాన్ని కల్పిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను పూర్తి చేయాలని సూచించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్