ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప లో మరో దారుణానికి పోలీసులు ఒడిగట్టారు.
తన ప్రియురాలిని కొందరు వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ లో ఒక యువకుడు ఫిర్యాదు చేయగా అతడిపైనే పోలీసులు కక్షగట్టిన విచిత్ర సంఘటన ఇది.
నీలకఠం అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు. ఎవరైతే అమ్మాయిని వేధిస్తున్నారో వారిని వదిలేసిన పోలీసులు నీలకంఠం పైనే తమ ప్రతాపం చూపించడం మొదలు పెట్టారు.
వేధింపులకు గురి చేసిన యువకుడిని వదిలేసి ఫిర్యాదు చేసిన యువకుడిపై ఎస్సై శ్రీనివాసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
దాంతో పోలీసుల వేధింపులు తాళలేక నీలకంఠం ఆత్మహత్యాయత్నం చేశాడు. బి మఠంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
ఎస్సై వేధింపులు తాళలేక పురుగుల మందు సేవించి నీలకఠం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమించడంతో రిమ్స్ కు తరలించారు.