Slider కడప

కడప జిల్లాలో పోలీసుల వేధింపు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం

#Neelakantham

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప లో మరో దారుణానికి పోలీసులు ఒడిగట్టారు.

తన ప్రియురాలిని కొందరు వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ లో ఒక యువకుడు ఫిర్యాదు చేయగా అతడిపైనే పోలీసులు కక్షగట్టిన విచిత్ర సంఘటన ఇది.

నీలకఠం అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు. ఎవరైతే అమ్మాయిని వేధిస్తున్నారో వారిని వదిలేసిన పోలీసులు నీలకంఠం పైనే తమ ప్రతాపం చూపించడం మొదలు పెట్టారు.

వేధింపులకు గురి చేసిన యువకుడిని వదిలేసి ఫిర్యాదు చేసిన యువకుడిపై  ఎస్సై శ్రీనివాసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

దాంతో పోలీసుల వేధింపులు తాళలేక నీలకంఠం ఆత్మహత్యాయత్నం చేశాడు. బి మఠంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

ఎస్సై వేధింపులు తాళలేక పురుగుల మందు సేవించి నీలకఠం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమించడంతో రిమ్స్ కు తరలించారు.

Related posts

అనంతపురంలో మహిళా లెక్చరర్ పై హత్యాయత్నం

Bhavani

ప్రశాంతంగా ముగిసిన టీఎస్ పి సెట్ పరీక్షలు

Satyam NEWS

ఆకలి దేవోభవ

Satyam NEWS

Leave a Comment