శ్రీకాకుళం జిల్లాలో లక్ష్మీ నర్సంపేట (ఎల్.ఎన్.పేట) కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న బాలికలకు కరోనా సోకింది.
స్థానిక ప్రభుత్వ వైద్య శాఖ అధికారి టీ.ప్రవల్లిక, తాసిల్దారు డి.ఎస్.ఎస్.సత్యనారాయణ ఆధ్వర్యంలో కరోనా పరీక్ష నిర్వహించగా ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ సోకిందని వెల్లడి అయింది.
ఈ సమాచారం తెలుసుకున్న మండల ప్రత్యేక అధికారి కె.రామారావు, యమ్. పి. డి .వో .ఆర్ కాళీ ప్రసాదు పాఠశాలను సందర్శించి ఇక్కడ పనిచేస్తున్న బోధనా సిబ్బందికి, సిబ్బందికి కరుణ పరీక్ష నిర్వహించారు.
జిల్లాలో కే.జీ.బీ.వీ. రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా విస్తరిస్తున్న రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు, విద్యాశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.