28.7 C
Hyderabad
April 28, 2024 06: 30 AM
Slider విజయనగరం

9న రామ‌తీర్దం పై మత కమిటీ సమావేశం

#Ramateerdham

దేవాల‌యాల‌పై కుట్ర పూరితంగా దాడులు జరుగుతున్నాయ‌న్న అప‌వాదు నుంచి బయ‌ట ప‌డేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిద్దుబాబు చ‌ర్య‌లు చేపట్టింది. చీఫ్ సెక్ర‌ట‌రీ ఆదిత్య దాస్ నేతృత్వంలో  శాంతి క‌మిటీ వేసిన ప్ర‌భుత్వంం…జిల్లాల వారీగా ఆ పీస్ క‌మిటీల‌ను వేయ‌నుంది.

ఈమేర‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ నెల 9వ  తేదీన క‌లెక్ట‌ర్,ఎస్పీ, మైనారిటీ సంఘాల పెద్ద‌లు,అలాగే హిందూ ధార్మిక  పెద్ద‌ల‌చే పీస్ కమిటీ వేయ‌నున్నారు. ఇందులో భాగంగా  క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సంబంధిత స‌భ్యులతో పీస్ కమిటీ ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా…జిల్లా క‌లెక్ట‌ర్,ఎస్పీల అధ్య‌క్ష‌త‌న స‌మావేశం జ‌ర‌గ‌బోతోంది.

హోం శాఖ అక్షింత‌లతో ప్ర‌భుత్వంలో చ‌ల‌నం..!

ఇదిలా ఉంటే ఏపీలోనే కాక దేశ వ్యాప్తంగా పేరొందిన రామ‌తీర్ధం ఘ‌ట‌న పై రాష్ట్ర ప్ర‌భుత్వం లో క‌దిల‌క వ‌చ్చేలా చేసింది…కేంద్ర  ప్ర‌భుత్వం చ‌ర్య‌లు.

ఇటీవ‌లే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు  సోము వీర్రాజు,ఎమ్మెల్సీ మాధ‌వ్ లు హ‌ఠాత్తుగా రామ‌తీర్దం నీలాచలం కొండ‌పైకి వెళ్లేందుకు యత్నించి పోలీసుల‌చే అరెస్ట్ కావడంతో ఆ అంశం కాస్త బీజేపీ హైకమాండ్ ను తాకింది.

దీంతో స్వ‌యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వ‌యంగా సోము వీర్రాజుకు ఫోన్ చేసి…విష‌యం క‌నుక్కున్న అనంతరం రాష్ట్ర  ప్ర‌భుత్వంలో  క‌దిలిక వ‌చ్చింది.

Related posts

విశాఖ విజయదుర్గా దేవి ఆలయంలో దోపిడి దొంగలు

Satyam NEWS

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారు?

Satyam NEWS

ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షం

Satyam NEWS

Leave a Comment