ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో గురువారం రాత్రి కరెంట్ షాక్ sy ఒక రోగి మృతి చెందిన ఘటన జరిగింది. ఈనెల 26 రాత్రి సమయంలో బుద్దారం గ్రామానికి చెందిన మార్త రమేష్ (40) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం చేరాడు. అయితే గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వైద్య సిబ్బందికి మార్త రమేష్ ఆసుపత్రిలో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది వెతికారు. ఈ క్రమంలో ఆసుపత్రిలోని విద్యుత్ మెయిన్లు ఉన్న ప్రదేశంలో అపస్మారక స్థితిలో అతడిని గుర్తించారు. అనంతరం అతడిని పరీక్షించగా మృతి చెందినట్లు అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post