37.7 C
Hyderabad
May 4, 2024 12: 13 PM
Slider రంగారెడ్డి

సొంత ఇంటికి వచ్చి విద్యుత్ షాక్ తో మెకానిక్ మృతి

#CurrentShock

వనపర్తి జిల్లా చిన్నంబాయి మండల పరిధిలోని దగడపల్లి గ్రామానికి చెందిన దివాకర్(35) విద్యుత్ షాక్ తో మృతి చెందారు.

గురువారం దగడపల్లి గ్రామంలో తన ఇంటిదగ్గర కొళాయి సంపు మోటర్ మెకానిక్ చేస్తుండగా సాయంత్రం ఐదు గంటలకు విద్యుత్ షాక్ తగిలి  మృతి చెందాడు.

మృతునికి భార్య కళావతి, రెండేళ్ల కూతురు లక్కీ ఉన్నారు. ఇటీవలే 16 రోజుల క్రితం మృతుని తండ్రి మరణించడంతో హైదరాబాద్ వనస్థలిపురంలో మెకానిక్ పని చేస్తున్న  మృతుడు గ్రామానికి వచ్చాడు.

అంతలోనే విద్యుత్ షాక్ తో దివాకర్ మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. వారి కుటుంబం ఇద్దరు పెద్దదిక్కు కోల్పోవడంతో  నిరాశ్రయులయ్యారు.

వారి బంధువులు కుటుంబ సభ్యులు  బోరున విలపిస్తున్నారు. మృతుని చిన్ననాటి స్నేహితులు 1998-1999 దగడపల్లి పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు బాల్యమిత్రుడు దివాకర్ మృతి చెందడం బాధాకరమని సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరమేష్, విష్ణు, మంజుల, రాజేశ్వరి, లక్ష్మీ, శైలజ ,వెంకటేష్, రవి ,నాగరాజు, పేరుమాల  శ్రీనివాస్, కురుమయ్య తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Related posts

జర్నలిస్టు జావీద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

Bhavani

రోడ్డు ఇచ్చిన టిఆర్ఎస్ నేతల ఫోటోలకు క్షీరాభిషేకం

Satyam NEWS

వి ఎస్ యూ ఎన్ ఎస్ ఎస్  వాలంటీర్లకు ఉపకులపతి అభినందనలు

Satyam NEWS

Leave a Comment