30.7 C
Hyderabad
May 5, 2024 05: 57 AM
Slider విశాఖపట్నం

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అనుమానాస్పద అదృశ్యం

#MLCMadhav

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఫోన్ పనిచేయట్లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం చలో అంతర్వేది నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖపట్నం నుంచి కాకినాడ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం నుంచి ఆయన ఫోన్ స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు.

ఎక్కడైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అంటూ కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా పోలీసులను ఆరా తీశారు.

కానీ పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Related posts

సంక్రాంతి సందర్భంగా అమరావతిలో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు

Satyam NEWS

భూ వివాదాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

Bhavani

మదర్ సేవ సమితి యూత్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం

Satyam NEWS

Leave a Comment