31.2 C
Hyderabad
May 12, 2024 01: 05 AM
పశ్చిమగోదావరి

ఏలూరులో ఒక వ్యక్తి దారుణ హత్య

ఏలూరు 3టౌన్ పరిధి ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయ రహాదారి   బ్రిడ్జి క్రింద ఒక వ్యక్తి  దారుణ హత్య కు గురయ్యాడు. నిర్మాణుష్యమైన స్దలంలో బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. తలపై తీవ్రగాయాలతో కొనూపిరితో ఉన్న వ్యక్తిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసు వాహనంలో తరలించారు.

ఏలూరు 3టౌన్ CI M.R.L.S. మూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయాల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు ఏలూరు రూరల్ తిమ్మారావు గూడెంకు చెందిన గొవ్వాడ కృష్ణ గా పోలీసులు గుర్తించారు. 40 ఏళ్ల అతను ఏలూరు SBI  యిన్ బ్రాంచిలో అవుట్ సోర్సింగ్ స్వీపర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు‌ గుర్తించారు. సంఘటనా స్దలానికి చేరుకుని ఏలూరు DSP ఓ దిలీప్ కిరణ్ వివరాలు సేకరించారు.

Related posts

భక్తుల తో కిటకిటలాడుతున్న పంచారామ క్షేత్రం

Bhavani

పంచాయితీ నిధుల స్వాహాపై విచారణ ప్రారంభం

Satyam NEWS

పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షడిగా విశ్వేశ్వరరావు

Satyam NEWS

Leave a Comment