ఖమ్మం నగరంలోని మమత హాస్పిటల్ రోడ్ లో గల లకారం ట్యాంక్బండ్ వద్ద ఆ సంఘం జాతీయ అధ్యక్షులు , రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ల చేతుల మీదుగా ఘనంగా రంభోత్సవం జరిగింది .
ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాధికారంలో సమానమైన వాటా కోసం 40
సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నామని , ఇప్పటికీ బీసీలకు సరైన ప్రాధాన్యత రావడంలేదని అన్నారు . ఒంట్లో చివరి రక్తపు బొట్టు వరకు బీసీ సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు .
పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఖమ్మంలో తన గెలుపులో ప్రతిసారి బీసీలు ముందుండి నడిపించాలని వారికి ప్రతి విషయంలో మొదటి మొదట ప్రాధాన్యత ఇస్తానని అన్నారు . త్వరలో బిసి భవన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు .