అక్టోబర్ 15న కర్ణాటక రాష్ట్రం లోని బళ్ళారిలో భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సోనియాగాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, చత్తీస్ ఘడ్ , రాజస్థాన్ ముఖ్యమంత్రులతో పాటు కాంగ్రెస్ కీలక నాయకులు పాల్గొననున్నారు . సుమారు ఐదు లక్షల మంది పాల్గొంటారనే అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నాటక కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్ , సిద్దిరామయ్య ఆధ్వర్యంలో సభ జరుగనుంది. కాగా సోనియాగాంధీ గతంలో ఇక్కడి నుండి ఎంపీగా గెలిచారు. బళ్ళారి హైదరాబాద్ కర్ణాటక (కల్యాణ కర్ణాటక )లోభాగం. 40 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి 2018 లో 21 స్థానాలు వచ్చాయి. బళ్ళారి జిల్లాలోనే 9 స్థానాలకు 6 గెలిచింది. ఇక్కడ జరిగే సభ జోడో యాత్ర లోనే అతి పెద్ద సభాగా నిలవాలని కేంగ్రెస్స్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది.