ఖమ్మం వన్ టౌన్ సీఐ స్వామిపై విచారణకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత నెల 29వ తేదీన కేఎంసీ ఎదుట ధర్నా చేసిన 54వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజులతో పాటు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసే క్రమంలో దురుసుగా ప్రవర్తించినట్లు కార్పొరేటర్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
దీంతో ఘటనపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.