శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ గా పైడి వెంకటరమణ నేడు పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి సంజీవ రావు, వారి కార్యాలయ సిబ్బంది, శ్రీకాకుళం జిల్లాలో కే.జీ.బీ.వీ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సమగ్ర శిక్ష లో పని చేస్తున్న సైట్ ఇంజనీర్ లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
వీరితో బాటు డి ఎం ఎల్ టి లు,సీ.ఆర్పీ.లు, ఐ ఈ ఆర్ టి లు, ఎం. ఆర్ .సి .సెంటర్ లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, యమ యస్ కోఆర్డినేటర్లు, అకౌంటెంట్లు, మెసెంజర్ లో, కేజీబీవీల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగస్థులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల సంఘ ,అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగు వెంకటరమణ, గుండబాల మోహన్, సంఘ సభ్యులు సిహెచ్ రవి కుమార్ , ఎల్ దిలీప్, అప్పలరాజు, సిహెచ్ శ్రీనివాస్,, సత్యనారాయణ, విజయ్, మార్కండేయులు, పాపారావు, కూర్మా రావు, రాంబాబు, లక్ష్మణ్ ,పద్మావతి ,లక్ష్మి, త్రివేణి, రాజేశ్వరి, జాన్ ఈశ్వరి, శివాని, రవణమ్మ, సన్యాసమ్మ, భారతి, ప్రియాంక ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు.