పాక్ గెలుపు ఇస్లాం విజయం అని, భారత ముస్లింలు తమవైపే ఉన్నారని అంటూ అడ్డమైన కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ సత్తా ఏంటో ముస్లిం ప్రపంచం ముందు ప్రదర్శించారు. మనకు ఇదే టీ20 ప్రపంచకప్ ఫైనల్. భారత్ సహా ప్రపంచంలోని ముస్లిం లందరి మద్దతు పాక్కు ఉంది. ఇది ఇస్లాం విజయమని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అన్నారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా.. శ్రీనగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కొందరు పాక్ విజయానికి సంబరాలు చేసుకున్నారు.