ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తొలగించండి.. లోయలోని ప్రజలతో నేరుగా మాట్లాడతాం.. అంటూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. జమ్ము కశ్మీర్లో మూడు రోజుల పర్యటనలో ఉన్న హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించే ముందు సెక్యూరిటీ అధికారులను ఇలా అదేశించారు.
కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్తో చర్చలు జరపాలని మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అంటున్నారని , దీనికి తాము అంగీకరించడం లేదని అన్నారు. కశ్మీర్ సమస్యలపై కశ్మీర్ ప్రజల తోనే ఎన్నిసార్లు చర్చలు జరపడానికైనా కేంద్రం సిద్దంగా ఉందన్నారు. అమిత్ షా మూడు రోజుల జమ్మూ కాశ్మీర్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.