గౌడ్ లు రాజ్యాధికారం దిశగా కృషి చేయాలని పట్టణ గౌడ యువజన సంఘ నాయకులు అన్నారు. మంగళవారం పాపన్న గౌడ్ 370 వ, జయంతి సందర్భంగా స్థానిక ఇందిరా చౌక్ లో గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించి గోల్కోండ కోటపై బహుజన పతాకాన్ని రెపరెపలాడించిన పాపన్న స్ఫూర్తిగా రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాకు బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్,వరంగల్ జిల్లాలకు సర్వాయి పాపన్న పేర్లను పెట్టాలన్నారు.
బహుజన విప్లవీరుని విగ్రహాలను గ్రామ గ్రామాన నెలకొల్పాలని అన్నారు. ఏటా ప్రభుత్వం పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా గీత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకొని,ప్రమాదాల బారిన పడిన కార్మికులకు సత్వరమే ఎక్స్ గ్రేషియా అందేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.
కార్యక్రమంలో పట్టణ గౌడ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు బెల్లంకొండ అమర్ గౌడ్,తండు సాయిరాం గౌడ్,పండ్ల హుస్సేన్ గౌడ్,దొంతగాని రాజా రమేష్ గౌడ్,కుక్కడపు నర్సింహారావు గౌడ్,పులి గోవింద్ గౌడ్,యలక సైదులు గౌడ్,పుట్ట నర్సింహా గౌడ్ పాల్గొన్నారు.
ఇంకా, ఐఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,మాజీ మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,కౌన్సిలర్లు యరగాని గురవయ్య గౌడ్, కారింగుల విజయ వెంకటేశ్వర్లు, గీతకార్మిక సంఘం ప్రెసిండెంట్ వల్లపుదాసు క్రిష్ణ గౌడ్,పిఏసిఏస్ ఛైర్మన్ యరగాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఇంకా యలక వెంకటేశ్వర్లు గౌడ్,తండు వెంకన్న గౌడ్, నర్సింగ్ సతీష్ గౌడ్,సోమగాని ప్రదీప్,సోమగాని వీరన్న గౌడ్ గౌడ్,బత్తిని ప్రసాద్ గౌడ్,నేలపట్ల అంజయ్య గౌడ్,దొంతగాని బుజ్జిబాబు గౌడ్,కుక్కడపు వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.