టీఆర్ఎస్ నాయకుడు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణించారు. నేటి ఉదయం 10.30నిమిషాలకు హైదరాబాద్ లో ఆయన చికిత్స పొందుతూ మరణిచారు.
ఆయన ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో చాలా కాలంగా పోరాడుతున్నారు. చివరకు మరణించారు. ఆయన కాంగ్రెస్ లో ఎమ్మెల్యే గా కొనసాగారు. ఆ తర్వాత వైఎస్ ఆర్ పార్టీ లో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా చేశారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో వున్నారు. ఉదయం ఆయన మరణ వార్తను విన్న అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కల్వకుర్తి మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి.