సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో శనివారం సమాచార హక్కు రక్షణ చట్టం నూతన సంవత్సర క్యాలెండర్ ను మండల తహసీల్దార్ వజ్రాల జయశ్రీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ జయశ్రీ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్న సమాచారం అడిగిన ప్రతి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందని,సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధం లాంటిదని,ఈ చట్టాన్ని ఉపయోగించి ప్రజలకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇవ్వడంతో పాటు అవినీతి రహిత సమాజం ఏర్పడి, ప్రభుత్వ పాలనలో మంచి పనులు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.
ఈ చట్టంపై అవగాహన కల్పించడానికి సొసైటీ సభ్యులు మరింత కృషి చేయాలని,ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా ఉండి పని చేసి ప్రజలకు కావలసిన సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి జోనల్ ఇంచార్జ్ నెమ్మది వెంకటేశ్వర్లు,జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి సాయిబాబా, మండల అధ్యక్షుడు పెండ్యాల నాగరాజు,మండల ప్రధాన కార్యదర్శి ధూళిపాల శ్రీనివాస్,గరిడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి కడప పెంటయ్య, ఇంటి రవి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్