ఉప్పల్ లోని గాస్పల్ చర్చికు పాస్టర్ గా ఉన్న జోసఫ్ అలియాస్ సాధు మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గుర్ని మోసం చేసిన సంఘటన ఇది. టీవీ ఛానల్లో మత ప్రభోధకుడు గా పని చేస్తూ అమాయక ఆడపిల్లలను ఇతను టార్గెట్ చేశాడు. చర్చికి వచ్చే అమ్మాయిలను లొంగదీసుకొని పాస్టర్ జోసఫ్ మోసం చేసేవాడు. విషయం తెలుసుకున్న MRPS నాయకులు పాస్టర్ ఆగడాలు పై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. లైంగిక దాడి చేసి, బెదిరింపులకు దిగుతున్నాడని ముగ్గురు అమ్మాయిలు కూడా ఫిర్యాదు చేశారు. పాస్టర్ ను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.