నవతరంపార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం జనవరి 1వ తేదీన జరుగుతుందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళగిరి లోని కేంద్ర పరిపాలనా కార్యాలయంలో నవతరంపార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉదయం పది గంటల సమయంలో జరుగుతుందన్నారు. నవతరంపార్టీ నేతలు,సభ్యులు ప్రతిఒక్కరికీ వ్యక్తిగత ఆహ్వానం పలుకుతున్నామన్నారు.
తప్పనిసరిగా అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు.2012 జనవరి ఒకటి న నవతరంపార్టీ ప్రారంభించిన నాటి నుంచి పదకొండు సంవత్సరాలు తనతో నడిచిన ప్రతిఒక్కరికీ ఈసందర్భంగా రావుసుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నేతలు పార్టీ నిర్మాణం కోసం శ్రమించడం వల్లనే ప్రజా సమస్యలపై పోరాటం చేయగలిగామన్నారు.