ఈ ఏడాది పప్పు అరుణకు అవార్డు బహుకరణ…!
ఈ నెల 29 ప్రముఖపాత్రికేయుడు, రచయత కే ఎన్ వై పతంజలి 70 వ జయంతి సందర్బంగా ఆయన పేరిట స్మారక అవార్డును ఈ ఏడాది పప్పు అరుణకు ఇవ్వనున్నట్టు కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక తెలిపింది. ఈ మేరకు వేదిక అధ్యక్షుడు లోక్ సత్తా పార్టీ నేత భీశెట్టి బాబ్జీ ఈ విషయాన్ని తెలిపారు.
అదే రోజు విజయనగరం వెంకటరమణ డిగ్రీ కాలేజీలో ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక ఆయన 70 జన్మదినాన్ని జరుపుతోందని… వేదిక అధ్యక్ష, కార్యదర్శులు బాబ్జీ,ఎన్.కే.బాబులు తెలిపారు. తెలుగు సాహిత్య ప్రపంచలో పతంజలిది అంది వేసిన చెయ్యి అని అన్నారు.అంతటి రచయత ,పాత్రికేయుడు విజయనగరం వాసి కావడం..జిల్లా వాసుల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమానికి సాహిత్య అభిమానులు అంతా అలాగే విజయనగరం జల్లా వాస్తవ్యులందరూ హాజరు కావొచ్చన్నారు.