పాకిస్తాన్లో అధికారం మారింది కానీ ప్రపంచ వేదికపై దాని ముఖచిత్రం మాత్రం అలాగే ఉంది. గతంలో కూడా పాకిస్తాన్ అంతర్జాతీయ బహిరంగ వేదికలలో అనేక సార్లు వివిధ దేశాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. ఈ ధోరణి ఇప్పుడు కూడా కొనసాగుతోంది.
ఇప్పుడు పాక్ ఆర్థిక మంత్రికి అమెరికాలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ గురువారం అమెరికా చేరుకున్నారు. ఆయన సమావేశానికి వెళుతుండగా దొంగలు, దొంగలు అంటూ కొందరు ప్రజలు నినాదాలు చేశారు. మరి కొంత మంది ప్రజలు ఆయనను అబద్ధాలకోరు అని బహిరంగంగా పిలిచారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. పాక్ మంత్రికి ఓ వ్యక్తి నువ్వు అబద్ధాల కోరు, దొంగ అంటూ చెబుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీని తర్వాత వారితో పాటు ఉన్న ఒక అధికారి కోపంతో ఊగిపోయాడు. అతను ప్రజలకు సమాధానం ఇస్తూ, నోరు అదుపులో పెట్టుకో అని కోపంగా చెప్పాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది.
గతంలో పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబు కూడా ఇలాంటి నిరసనలు ఎదుర్కొన్నారు. గత నెలలో మరియం ఔరంగజేబ్ లండన్ పర్యటనకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మద్దతుదారులు మరియంపై వ్యాఖ్యానిస్తూ మీరు లండన్లో ప్రజల సొమ్మును దోచుకుని సరదాగా గడుపుతున్నారు అంటూ ఆయన మొహం మీదే చెప్పారు.