ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు చరమగీతం పాడి మంచి ప్రభుత్వం వచ్చేవరకు పోరాడి తెలుగుదేశాన్ని గెలిపించుకుందామని బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు కోరారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విజయదశమి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు పాల్గొని శాస్త్రోక్తంగా వేద పండితుడిచే ప్రత్యేక పూజలు చేపట్టారు.
విజయదశమి సందర్భంగా చేపట్టిన ఈ పూజ కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు పాల్గొనగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజల ఆశలకు అనుగుణంగా పాలను అందించాయని ప్రస్తుతం అలా కాకుండా ప్రజలను హింసించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు.
ఇకనైనా జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని వచ్చే ఎన్నికల్లో తెదేపా అత్యధిక మెజార్టీతో గెలవాలని పూజలు చేసినట్లు ఆ దిశగా కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.