కరోన ఆపత్కాల సమయంలో ప్రజలకు మనోధైర్యాన్ని కలిగిస్తూ డాక్టర్ సంపత్ బృందం అందించిన వైద్య సేవలు అభినందనీయమని Tpcc కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ జమ్మిగడ్డ లోని కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ పదోన్నతి పై వెళ్లిన డాక్టర్ సంపత్ వీడ్కోలు సమావేశం గురువారం ఆరోగ్య కేంద్రంలో జరిగింది.
కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్వప్న రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆరోగ్య సిబ్బంది నాయకులు డాక్టర్ సంపత్ ను శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక శాతం పేదలు నివాసముండే జమ్మిగడ్డ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది సహకారంతో నిరంతర వైద్య సేవలు అందించడంలో డాక్టర్ సంపత్ నిర్వహించిన పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు.
వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగుల కళ్ళల్లో చిరునవ్వులు నిండేలా డాక్టర్ సంపత్ బృందం చేసిన కృషి మరువలేనిదని తెలంగాణ ఉద్యమ నాయకురాలు షేర్ మన్నెమ్మ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్, కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ పద్మావతి, డాక్టర్ సరిత, డాక్టర్ మాధురి చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లిపద్మారెడ్డి, బి జే ఆర్ కాలనీ మాజీ అధ్యక్షుడు ఎస్ ఏ రహీమ్, ఇతర ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి