31.2 C
Hyderabad
May 2, 2024 23: 19 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల సాత్తుమొర

#tirumala

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు.

సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంత‌రం ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణగా విచ్చేసి భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహించారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు జ‌రిగింది.

Related posts

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన జడ్పిటిసి సభ్యురాలు

Satyam NEWS

ట్రాజెడీ: కుప్పంలో ఇద్దరి సజీవ దహనం

Satyam NEWS

అధిక వర్షాల  పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment