వాసిరెడ్డి జయశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని సూర్య శ్రీ దివ్యంగుల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు మండవ మురళీకృష్ణ విచ్చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 55 మంది నిరుపేదలకు, వృద్దులకు, దివ్యంగులకు 2 5కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.
అనంతరం 100 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ గౌరవ సలహాదారు మండవ సుబ్బారావు మాట్లాడుతూ నిజమైన పేదలకు సహాయం అందినపుడే జయశ్రీ గారి ఆత్మకి శాంతి కలుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమానికి 70వేలు రూపాయలు సహాయం అందించిన కళ్యాణ్ కి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్పర్సన్ సయ్యద్ సహనాజ్, ట్రస్ట్ సెక్రెటరీ షేక్ సర్దార్ భాష, నంబూరి శ్రీరాములు పాల్గొన్నారు.