అంబర్పేట్ నియోజకవర్గంలో మేడే వేడుకలు బిఆర్టీయు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విచ్చేసి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం జీహెచ్ఎంసీ కార్మికులు, ఆశా వర్కర్లను, భవన నిర్మాణ కార్మికులను, ఆటో డ్రైవర్, డీసీఎం యూనియన్ నాయకులను సన్మానించి అనంతరం కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్టీయు అంబర్పేట్ అధ్యక్షులు నిరంజన్, ప్రధాన కార్యదర్శి రామ్ కిషన్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట్