సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తిలక్ నగర్ పరిధిలో కుడితొట్టి అండ్రుపాల్ కొన్ని రోజుల నుంచి కిడ్నీ,లివర్ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. బాధితుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కడు నిరుపేద కుటుంబం. ఉన్న పైసలు కాస్తా కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు చేయడంతో కుటుంబం చాలా దీనత్వంలో పడింది. హుజూర్ నగర్ తిలక్ నగర్ అంబేద్కర్ అసోసియేషన్ ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆండ్రుపాల్ ని శుక్రవారం పరామర్శించి ధైర్యం చెప్పి పండ్లు,బ్రెడ్స్,కొంత ఆర్థిక సహాయం నగదు రూపంలో అందించారు. ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి సహాయం చేయాలని అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్ కోరారు.
ఈ సి ఎస్ ఐ చర్చి సెక్రటరీ మాదా ఏసు,కోల్లపూడి ఏసురత్నం,కుడితొట్టి ఇర్మియ,నూకతొట్టి ప్రమోద్,కోల్లపూడి సతీష్,కోల్లపూడి కాంతయ్య,సివినేని అబ్రహం,భారతం జయరాజు,దగ్గుపాటి పేతురు,మామిడి దావీదు,కోల్లపూడి పద్మ, మామిడి కాంతమ్మ,కుడుతొట్టి వినోద, మామిడి విజయ,విజయ్ రాణి తదితరులు పరామర్శించారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్