31.7 C
Hyderabad
May 2, 2024 08: 06 AM
Slider ముఖ్యంశాలు

ప్రశ్నించే వారిపై కేసులా..

#Minister Kishan Reddy

ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు . అనేక మంది ప్రాణత్యాగం తో ఏర్పడిన తెలంగాణ చివరకు ఒక కుటుంబానికి పరిమితమందని దుయ్యబట్టారు . రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని , సంక్షేమ పాలన అంటూ సంక్షోభం దిశగా పాలన సాగుతుందని విమర్శలు గుప్పించారు.

పోలీసు అధికారులు, వారి కనుసన్నల్లో పని చేసేలా కేసీఆర్ కుటుంబం చేసుకుందని విమర్శలు చేశారు . తెలంగాణలో దళితబంధు పథకం బీఆర్ఎస్ బంధుగా మారిందన్నారు. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మాఫియా మాదిరి బీఆర్ఎస్ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఈ నెల 27న ఖమ్మంలో నిర్వహించే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని అన్నారు.

Related posts

ఇంటర్ పరీక్షల కోసం పకడ్బందిగా ఏర్పాట్లు చేయాలి

Satyam NEWS

కేసీఆర్ కాన్వాయ్ కి అడ్డుపడ్డ నిరుద్యోగల అరెస్టు

Satyam NEWS

రేష‌న్ డీల‌ర్ల‌ను తొల‌గించం

Sub Editor

Leave a Comment