ప్రస్తుతం ఎకరా రెండు లక్షలు పలికే విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆర్డీఓ ఆఫీస్ ను..టీడీపీ ప్రభుత్వ హయాంలో అశోక్…. ఎంతకమ్మేరో అందరికీ తెలిసిందేనని డిప్యూటీ స్పీకర్ …విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సంచలన మైన ఆరోపణలు చేశారు. అలాగే అన్న క్యాంటీన్ లలో ఎంత మోసం జరిగిందో కూడా తెలుసునని…ఇక రింగ్ రోడ్ లో డంపింగ్ యార్డ్.. ఇలా చాలా స్థలాలను…అతి తక్కువ ధరకే కోడ్ చేసి…డబ్బులు వెనకేసుకున్పారని…డిప్యూటీ స్పీకర్ ఆరోపించారు. విజయనగరం ఎమ్మెల్యే గా ఉన్న నేను.. ఒక్క జాగా గానీ.. ఎవ్వరి వద్ద ఒక్క పైసా కూడా తాను తీసుకోలేదని… ఒకవేళ తీసుకున్నట్లు రుజువు చేస్తే….ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సవాల్ విసిరారు. ఈ మేరకు విజయనగరం లో తన నివాసంలో….మీడియా తో..మాట్లాడుతూ…. ఆగ్రహంతో అలాగే ఆవేశ పూరితంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడటం…సంచలనం కలిగించింది.
previous post