27.7 C
Hyderabad
May 4, 2024 10: 48 AM
Slider హైదరాబాద్

నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ తెలియజేయాలి

#amberpet

భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు వ్యతిరేకంగా నిర్లక్ష్యంగా మాట్లాడడం విడ్డూరమని అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బుదవారం జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, కాచిగూడ సీనియర్ నాయకులు బత్తుల శిరీషతో కలిసి కాచిగూడ నుంచి అంబర్పేట్ శ్రీరమణ  చౌరస్తా వద్ద బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, అంబర్పేట్ చౌరస్తా లో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంటనే మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ తెలియజేయాలని, లేని పక్షంలో తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీని క్షమించదని తెలియజేశారు. రాజ్యసభలో తెలంగాణ రాష్ట్రంపై తన ద్వేషాన్ని, అసహనాన్ని తెలియజేసి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను, అమరవీరులను, వారి త్యాగాలను బలిదానాలను గుర్తించకుండా అవమానించారని ఎమ్మెల్యే అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి, అంబర్పేట్ నియోజకవర్గానికి గాని, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో గాని, తెలంగాణ రాష్ట్రానికి గాని, ఒక్క రూపాయి కూడా తేకపోవడం తెలంగాణ సమాజమంతా కూడా గమనిస్తున్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్లు, అంబర్పేట్ సిద్ధార్థ ముదిరాజ్,బాగ్ అంబర్పేట్ చంద్రమోహన్, కాచిగూడ భీష్మ, నల్లకుంట మేడి ప్రసాద్, గోల్నాక కొమ్ము శ్రీనివాస్, సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు, మైనార్టీ నాయకులు, అనుబంధ సంస్థ సభ్యులు, ప్రతి ఒక్కరు కూడా పాల్గొని నిరసన తెలియజేశారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఎట్టకేలకు పెద్దపల్లి పోలీసులకు దొరికిన కిడ్నాపర్లు

Satyam NEWS

పేలిన నాటు తుపాకి.. వేటగాడు మృతి

Satyam NEWS

ఇంకా అలక వీడని రాహుల్ గాంధీ

Satyam NEWS

Leave a Comment