23.2 C
Hyderabad
May 8, 2024 00: 05 AM
Slider ఆధ్యాత్మికం

ఉజ్జయిని మహంకాళి జాతరకు భారీ బందోబస్తు

#ujjainimahakalitemple

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానుండటంతో మూడు వేల మంది సిబ్బందితో పాటుగా వందకు పైగా కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే అన్ని శాఖల సమన్వయంతో అమ్మవారి ఆశీస్సులతో బోనాల జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని సిద్దం చేశారు. వాటర్ వర్క్స్ శాఖ ఆధ్వర్యంలో వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ సిద్దం చేశారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 3 ప్రాంతాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహంకాళీ అమ్మవారి దేవాలయానికి వెళ్లే ముఖద్వారాలను ప్రారంభించిన మంత్రి తలసాని పోతరాజుల మధ్య డాన్స్ చేసి బోనాలకు ముందే పండగలో మంచి జోష్ నింపారు. బంగారు బోనం సమర్పించారు. ఇక సోమవారం రోజు అమ్మవారి రంగం కార్యక్రమం ఉంటుంది.

Related posts

జ‌న‌వ‌రి 19 వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Satyam NEWS

ప్రారంభమైన కిరణ్‌ అబ్బవరం ‘సెబాస్టియన్‌ పిసి524’

Satyam NEWS

Analysis: నీటి గండాలు గట్టెక్కేదెట్లా?

Satyam NEWS

Leave a Comment