40.2 C
Hyderabad
May 6, 2024 15: 54 PM
Slider ప్రత్యేకం

దొంగతనానికి పాల్పడిన ఎస్ ఐ పై పోలీసు కేసు నమోదు

#sekhargoud

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శేఖర్ గౌడ్, తన పోలీస్ సిబ్బంది తో కలిసి ట్రాక్టర్ ను దొంగతనం  చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. ఆగస్టు 18వ తారీకు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో తన ట్రాక్టర్ ను దొంగ తాళంతో తీసుకువెళ్లారని బాధితుడు తెలిపాడు.

ఆ ట్రాక్టర్ కు జిపిఎస్ సదుపాయం ఉన్నందున జిపిఎస్ ట్రాక్ ను ఓపెన్ చేయగా ఆ సిగ్నల్ ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లుగా గుర్తించారు. నేను వెళ్లి ఎస్ఐ ని కలువగా సరైన సమాధానం చెప్పకుండా పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్ ఉన్నట్లు ఎవరికైనా చెప్తే నీ మీద మా సిఐ అనుదీప్ తో కలిసి గంజాయి ఉన్నట్లు దొంగ కేసులు పెడతా జాగ్రత్త అని భయభ్రాంతులకు గురి చేశారు. నీ ట్రాక్టర్ తో పని ఉంది తర్వాత పంపిస్తా అని నన్ను బయటకు పంపించారు. తర్వాత రమ్మని ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపారు.

నాలుగు రోజులు తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్ళినట్లు బాధితుడు తెలిపాడు. నీ ట్రాక్టర్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయిందని 25వేల రూపాయలు ఫైన్ కట్టి తీసుకెళ్లమని ఉప్పునుంతల ఎస్ఐ శేఖర్ గౌడ్ చెప్పాడని బాధితుడు తెలిపాడు. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో  గౌరవ కోర్టు ను ఆశ్రయించాల్సి వచ్చింది. దీనితో  కోర్ట్ అదేశాలతో వంగూర్ పోలీస్ స్టేషన్ లో ఉప్పునుంతల ఎస్ఐ శేకర్ గౌడ్ తో పోలీస్ చిబ్బంది పై ఎఫ్ఐ ఆర్ నమోదు అయినట్లు బాధితుడు చెప్పారు. సంబంధిత ఎఫ్ఐఆర్ కాపీని చూపించారు.

Related posts

కనకదుర్గ దేవస్థానంలో సస్పెన్షన్ల పర్వం మొదలు

Satyam NEWS

250కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

Bhavani

తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభం

Satyam NEWS

Leave a Comment