వైసీపీ జిల్లా అధ్యక్షులలో మరో అధ్యక్షుడు తప్పుకున్నాడు. ఇప్పటికే గుంటూరు జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న మేకతోటి సుచరిత పార్టీ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకోగా ఇప్పుడు అనంతపురం జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి రాయదుర్గం శాసనసభ్యుడు, కాపు రామచంద్రా రెడ్డి తప్పుకుంటున్నారు. తమ కుటుంబంలో జరిగిన విషాదం వల్ల జిల్లా స్థాయి కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రాయదుర్గం నియోజకవర్గం పై మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నందున, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా వేరే వారిని నియమించవలసిందిగా ఆయన కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి కి ఇప్పటికే ఈ విషయం తెలిపానని అందుకు ఆయన సమ్మతించారని ఆయన తెలిపారు. తనకు అనంతపురం జిల్లా అధ్యక్షులుగా ఈ వరకు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
previous post
next post