కరోనా వైరస్ లో కొత్త వేరియంట్లు ఉన్నాయన్న కేంద్రం హెచ్చరికలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్ర, కేరళలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలోని మొత్తం ఏడు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.