39.2 C
Hyderabad
April 28, 2024 11: 46 AM
Slider నల్గొండ

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి

#santsevalal

ఈ నెల 27న హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు జరిగే సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ,జయంతి ఉత్సవ కార్యక్రామాన్ని జయప్రదం చేయాలని నియోజకవర్గ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ బానోతు వెంకటేశ్వర్లు నాయక్  కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు శుక్రవారంనాడు మండల పరిధిలోని హేమ్లాతండాలో జయంతి  ఉత్సవాల సన్నాహక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాణోతు వేంకటేశ్వర్లు నాయక్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుడు శానంపుడి సైదిరెడ్డి  ఆదేశాల మేరకు హుజూర్ నగర్ పట్టణం లోని టౌన్ హాల్ ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయిలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.సంత్‌ సేవా లాల్‌ శాంతి స్వరూపుడుని,ఆయన చూపిన ఆడుగు జాడల్లో బంజారాలంతా నడుచుకోవాలని అన్నారు.నైజాం సర్కారుతో పోరాటం చేయడం వల్లనే బంజారాల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో బంజారాహిల్స్‌ ను నైజాం ప్రభుత్వం కేటాయించిందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జయంతిని నిర్వహించడం హర్షణీయమన్నారు.

నియోజకవర్గ కేంద్రంలో  నిర్వహించే సేవాలాల్ జయంతి వేడుకలకు నియోజకవర్గ,మండల,గ్రామ స్థాయి  గిరిజన నాయకులు,గిరిజన ప్రజా ప్రతినిధులు,గిరిజన సంఘాల నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అడ్వకేట్ నగేష్ రాథోడ్,సేవాలాల్ సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ధరావత్ రవిందర్ నాయక్, స్థానిక సర్పంచ్ బిక్షం నాయక్,పీఏసీఎస్ డైరెక్టర్ బానోతు బాబు నాయక్,మాజీ సర్పంచ్ జయరాం నాయక్,సేవాలాల్ రైతు సేన జిల్లా అధ్యక్షుడు బానోతు సైదా నాయక్,ఎల్ హెచ్ పి ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు నాగరాజు నాయక్,జిల్లా నాయకులు లీలాధర్ మణికంఠ నాయక్,రవి నాయక్,బిక్షం నాయక్,భంగి నాయక్,సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నిత్యావసర వస్తువులతో పాటు మాస్కుల పంపిణీ

Satyam NEWS

ఘనంగా శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు 533వ జయంతి ఉత్సవాలు

Satyam NEWS

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి నిమ్మగడ్డ కితాబు

Satyam NEWS

Leave a Comment