సమాజంలో పోలీస్ అంటే ఓ ధైర్యం..ఓ అండ అని..దాన్ని రిటైర్మెంట్ అయినంతవరకు నిలబెట్టుకుని తద్వారా ఓ అపద్భాంధవుడిలా ఉండాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రం బ్యారెక్స్ లో ఇద్దరు ఉద్యోగస్థుల పదవీ విరమణ సందర్బంగా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు.
కాగా రిటైర్ అయిన రోజు కూడా పోలీస్ యూనిఫాం ధరించాలని కోరానని ఎస్పీ ఈ సందర్బంగా అన్నారు. ఎస్.కోట, విజయనగరం ఏఆర్ లో ఏఎస్ఐలు గా పని చేసి పదవీ విరమణ పొందిన చిన్నయ్య,నాగేశ్వరరావులను ఎస్పీ దుశ్శాలువతో సత్కరించారు..
ఈ సందర్బంగా ఎస్పీ రాజకుమారీ ఇచ్చిన వీడ్కోలు సందేశం….యావత్ పోలీస్ శాఖకే ఓ స్పూర్తిని రగిల్చింది. పోలీసంటే. కర్తవ్య దీక్షతో పాటు వారి కుటుంబ యోగ క్షేమాలు కూడా ప్రతీ ఒక్కరికీ ఎంతో అవసరమన్నారు.
ఇక శాఖలో పని చేస్తూ….పొరుగు రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా జిల్లా పోలీసు నగదు ప్రొత్సాహక బహుతులను అందుకొవడం…జిల్లాతో పాటు పోలీస్ శాఖకు ఎంతో గర్వకారణమని…. ప్రతీ ఒక్కరూ ఆ విధమైన స్పూర్తితో పని చేయాలని ఎస్పీ కోరారు.
ఇక కరోనా సమయంలో దాదాపు 11 నెలల పాటు జిల్లాకు సిబ్బంది అంతా కాపాడటం వల్లనే…పోలీస్ అధికారిణిగా నాకు జాతీయ అవార్డు దక్కిందన్నారు. సిబ్బంది శాఖ పరంగా చేసిన పనితరం..చేసిన కర్తవ్యం.చూపిన నిబద్ధతలే అందుకు కారణమన్నారు.
అంతకుమందు విజయనగరం డీఎస్పీ అనిల్ మాట్లాడుతూ…రిటైర్ అయిన ఇద్దరు సిబ్బంది విజయనగరం సబ్ డివిజన్ కు చెందిన వారు కావడంతో ఎంతో గర్వకారణమన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏఆర్ డీఎస్పీ శేషాద్రి మాట్లాడుతూ…ఎస్పీ మేడం చూపిన తెగువ..నడిచన మార్గం తమకు ఎంతో స్పూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ రాంబాబు,..ఏఆర్ సిబ్బంది చిరంజీవి…పీఆర్ ఓ కోటేశ్వరరావు తదితరలు పాల్గొన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్