29.7 C
Hyderabad
May 2, 2024 06: 38 AM
Slider గుంటూరు

నరసరావుపేటలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం

#Dr.Chadalawada

గుంటూరు జిల్లా నరసరావుపేటలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఒక వ్యక్తి మైనర్ బాలికను మిత్రులతో కలిసి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. కిడ్నాప్ ను అడ్డుకున్న స్థానికుల పై దాడి చేసి దుండగులు పరారయ్యారు.

నరసరావుపేట పట్టణ శివారులోని శివ సంజీవయ్య కాలనీకి లో నివసిస్తున్న సుకన్య (14) ను అదే ప్రాంతానికి చెందిన మహేంద్ర, అతని మిత్రులు కిడ్నాప్ యత్నం చేశారు. రాత్రి సమయంలో కిడ్నాప్ చేయాలని ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోగా వారిపై కర్రలతో దాడి  చేసి పరారయ్యారు.

అన్యాయం జరిగిన సుకన్య కుటుంబానికి న్యాయం చేయాలని దిశ చట్టం ద్వారా దోషులను శిక్షించాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు. నిందితుల పై చార్యలు తీసుకోవాలని దిశ  స్టేషన్ ఎదుట ఆయన ఆందోళన చేశారు.

దిశ చట్టం తో మహిళలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అమలు జరగడంలేదని ఆయన అన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా న్యాయం జరగని పరిస్థితి దిశా పోలీస్ స్టేషన్లో కొనసాగుతుందని చదలవాడ పేర్కొన్నారు.

Related posts

వైపరిత్యం

Satyam NEWS

కొలాప్స్: చంద్రబాబునాయుడి పదవికి ఫొటో ఫినిష్

Satyam NEWS

అసాంఘిక కార్యకలాపాలకు సీసీ కెమెరాలతో చెక్

Satyam NEWS

Leave a Comment