Slider నల్గొండ

శాంతియుతంగా చేస్తున్న భారత్ బంద్ ను అడ్డుకోవడం పిరికిపంద చర్య

#hujurnagarbundh

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీల, రైతు సంఘాల నాయకులతో కలసి శాంతియుతంగా భారత్ బంద్  నిర్వహిస్తుంటే అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడం పిరికిపంద చర్య అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ ఇంచార్జీ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. భారత్ బంద్ కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలతో బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శాంతియుత వాతావరణంలో రైతు సంఘాల నాయకులు,వైయస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్,సిపిఐ,సిపిఎం, తెలుగుదేశం,టీజేయస్,సిపిఐ ఎంఎల్, న్యూడెమోక్రసీ పార్టీల నాయకులతో జరుపుతున్న భారత్ బంద్ ను జరపకుండా పోలీసులు అడ్డుకుని నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని,దేశ సంపదను విదేశీ,స్వదేశీ కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతుందని,ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేస్తున్న మోడీ ప్రభుత్వాలపై పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని,నిరుద్యోగులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ సంస్థలు అమ్మకాల నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతు సంఘాల నాయకులతో కలసి శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహిస్తుంటే అడ్డుకోవడం సరికాదని ఇలా ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్టులు చేయడం పిరికిపంద చర్య అన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా కో కన్వీనర్ శాసనాల అంజి నాయుడు,నున్న రామారావు,కందుల నర్సింహా రెడ్డి,ఆనెపు బ్రహ్మచారి,తోట కోటి, ఎస్ కె.హసన్ మియా,ఎస్ కె.అక్బర్,డి. నాగేంద్రబాబు, నాగ, నరేష్, మురళి, సత్యం, రాము, పాషా,అహ్మద్,శివారెడ్డి,నరేందర్ రెడ్డి,నరసింహారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించిన మనో

Satyam NEWS

అల్లా దయవల్ల రంజాన్ లో అందరూ బాగుండాలి

Satyam NEWS

ఉగ్రవాదుల యాప్ లను బ్యాన్ చేసిన కేంద్రం

Satyam NEWS

Leave a Comment