అల్లా దయవల్ల రంజాన్ మాసంలో అందరూ సుఖశాంతులతో బాగుండాలని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి దేవుని ప్రార్థించారు. నారాయణరెడ్డి పేట లోని బిలాల్ మసీదులో ఆదివారం సాయంత్రం స్థానిక ముస్లింలు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుభాలకు నిలయమైన రంజాన్ మాసం సత్ప్రవర్తనను మానవతను బోధిస్తుందన్నారు. ప్రస్తుత సమాజానికి అది ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు నాగరాజు, రామ్మోహన్ యాదవ్, నూనె మల్లికార్జున యాదవ్, మసీదు పెద్దలు బషీర్ అహ్మద్ , మౌలాలి, షానవాస్, అన్సర్ భాష, తాజుద్దీన్, వైసీపీ నేతలు కమలాకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సుధాకర్ యాదవ్, లచ్చా రెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, అల్లా బక్షు, మధు,నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
previous post