దేశ వ్యాప్త బంద్ పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో వామపక్ష,కాంగ్రెస్ పార్టీలు బంద్ నిర్వహించాయి..ఓవైపు గులాబ్ తుపాన్ ప్రభావంతో భారీ వర్షం పడుతున్న…ముందుగా చెప్పిన విధంగానే వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు బంద్ నిర్వహించాయి.జగన్ సర్కార్ కు కూడా…పరోక్షంగా బంద్ నకు సహకరించాయి.ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచీ 12 గంటలకు ఎక్కడి బస్సులను అక్కడే నిలుపుదల చేసారు.
ఈక్రమంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్ష,కాంగ్రెస్ ,లోక్ సత్త పార్టీలు బంద్ నిర్వహించాయి. మోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఓవైపు భారీ వర్షం పడుతుండగానే…బంద్ నిర్వహించారు.ఈ సందర్బంగా వామపక్ష,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు మాట్లాడుతూ…నిరంకుశత్వ ధోరణిలో మోడీపాలన సాగిస్తున్నారని….కార్పొరేట్ కంపెనీలకు దేశం సొత్తును అమ్ముతున్నారని ఆరోపించారు.
దేశాన్ని అధాని అంబానీలకు మోడీ అమ్మేస్తున్నందుకు బంద్ చేస్తున్నామని……. మీకు దమ్ముంటే… విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకుండా ఉండాలని మోడీకి చెప్పండని..అలాగే.. విద్యుత్ టారిఫ్ చార్జీలు పెంచకుండా ఆపమని మోడీ కి చెప్పాలి…..పోర్టులు…..విమానయానం అమ్మకుండా మీ మోడీకి చెప్పండంటూ వామపక్షాలు గొంతెత్తి ప్రశ్నించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని బంద్ చేస్తున్నామని….. నోళ్ళ మూసుకుని కాసేపు చేతులు ముడుసు కుని కూర్చోడానికి భారతీయులు మీలాగా బ్రిటీషు వాళ్ళు కి కాల్లుమొక్కే రకం కాదని….. పోరాడి ప్రాణాలిచ్చే వాళ్ళు.. ఇప్పుడు చెప్పండి మీరు భారతీయు లా.. దేశభక్తులా… లేదా దేశ ద్రోహులా అంటూ నడిరోడ్డు సాక్షిగా ప్రశ్నించారు.