అనాథలైన పిల్లలను అన్ని విధాల ఆదుకుంటామని బాలల సంక్షేమ సమితి జిల్లా చైర్మన్ బి.ఆర్.రమణారావు తెలిపారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గత సంవత్సరం మార్చి నుండి ప్రస్తుత నెల వరకు కరోనా వలన తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలు,తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారికి ప్రభుత్వం తరుపున వారికి కావాల్సిన విద్య,పునరావాసం,ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. వారి యొక్కఅన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.ఈ రోజు 25 మంది పిల్లల యొక్క స్థితి గతులను తెలుసుకొని వారికి కావాల్సిన సహాయం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిడబ్ల్యుసి సభ్యులు కొంపల్లి రాంరెడ్డి,పజ్జురి బిక్షం,ధనమ్మ, సిడిపిఓ,పి.ఓ లు నాగుల్ మీరా, శ్రీలక్ష్మి, విద్యాసాగర్,సఫియా,సాయీ,కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్