ఉత్తరాంధ్ర లో అల్పపీడన ప్రభావం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు అటు రెవెన్యూ, ఇటు పోలీసు శాఖ లు అప్రమత్తం అయ్యాయి.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారీ ,ఎస్పీ దీపికా ఎం పాటిల్ ఆదేశాల మేరకు.. తీర ప్రాంత అధికారులు.. ప్రజలను అలెర్ట్ చేసారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భోగాపురం, పూసపాటిరేగ పోలీసులు… సంబంధిత ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ మేరకు భోగాపురం సీఐ శ్రీధర్, పూసపాటిరేగ ఎస్ఐ జయంతి లు…తిప్పలవలస ,చింతపల్లి గ్రామాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ…మాట్లాడారు.
previous post