తెలంగాణ ఉద్యమం కోసం ఇల్లు ని సైతం అమ్ముకున్న తనను ఈరోజు బిచ్చమెత్తుకుని పరిస్థితికి తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ చర్యలకు నిరసనగా ఓ యోధుడు బిచ్చం ఎత్తారు.
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బివి రమణ సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా నేడు వినూత్నంగా బిక్షం దేహి అని భిక్షం ఎత్తుతూ ప్రదర్శన నిర్వహించారు.
హైదరాబాద్ లోని అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తా లో బి వి రమణ మాట్లాడుతూ ఉద్యమకారులను పట్టించుకోని కేసీఆర్ ప్రజలను ఎలా చూస్తారు అని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ కి కొడుకు మీద ఉన్న ప్రేమ ఉద్యమకారులపై లేదని తన కొడుకు కేటీఆర్ ను సీఎం చెయ్యాలనే తపన తప్ప ఉద్యమకారుల బాధలు ఎన్నడూ పట్టించుకోలేదని అన్నారు.
ఉద్యమకారులను కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.