ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ‘జన గర్జన’ సభలో భారీగా వచ్చిన ఆయన అభిమానుల సమక్షంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పొంగులేటికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పొంగులేటితో పాటు పిడమర్తి రవి, అరికెల నర్సిరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డితో పాటు పలువురు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం 109 రోజులు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు హాజరయ్యారు.