ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమయ్యింది . ఎప్రిల్ చివరివారంలో గాని , మే మొదటివారంలో గాని మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం వున్నది. ఈసారి మంత్రివర్గంలో అంతా కొత్తవారే వుండొచ్చని సమచారం. తమను కొనసాగించండి అని నోరుతెరిచి అడిగిన కొందరికి సియం జగన్ కుదరదని చెప్పేశారని సమాచారం . వచ్చే ఎన్నికలకు కొత్త మంత్రులతోనే పోవాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. సీనియర్ నేతలను ఎన్నికలకు వ్యూహకర్తలు వినియోగించుకొనున్నారు. ఈ విషయాన్నే వారికి తెలియచేసినట్లు తెలిసింది. అలాగే సీనియర్ మంత్రుల సేవలు ఎన్నికలకు అవసరం వుంటుందని , అందుకే వారిని ఇంచార్జులుగా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం . కొత్త క్యాబినెట్ లో యువకులకు , అనుభవం వున్నవారికి , దూకుడున్న వారికి అవకాశం లభించవచ్చు . అన్ని కోణాల్లో సీయం స్వయంగా లెక్కలు సరిచూస్తూ నూతన మంత్రులను తీసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకుల ఆభిప్రాయంగా వుంది . రెండున్నరేళ్ళ తర్వాత కొత్త మంత్రులను తీసుకుంటామని గతంలోనే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం, ఇప్పుడు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుండటంతో ఆశావహులైన ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
previous post