38.2 C
Hyderabad
May 5, 2024 19: 08 PM
Slider ఖమ్మం

బాధితులకు భరోసా కల్పించడమే ధ్యేయంగా ఉండాలి

#KhammamPolice

ఫిర్యాదులపై క్షేత్రస్ధాయిలో విచారణ చేపట్టి వాస్తవాలు తెలుసుకొవాలని బాధితులు భరోసా కల్పించాలని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న  ప్రజాదివాస్ కార్యక్రమాన్ని సోమవారం  పోలీసు కమిషనర్  ఆద్వర్యంలో నిర్వహించారు.

పోలీస్  కమిషనర్  కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఫిర్యాదులో అధికంగా భూ వివాదాలు , కుటుంబ , వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలు , భార్యభర్తల సమస్యలపై వచ్చిన బాధితుల ఫిర్యాదులను పరిశీలించారు.

ఫిర్యాదలపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత  పోలీస్ స్టేషన్ల SHO అధికారులకు ఆదేశించారు.

Related posts

సమష్టిగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం

Satyam NEWS

సజెషన్: గెలిచిన వారు పదవులకు వన్నె తేవాలి

Satyam NEWS

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌ ఆస్తుల వేలానికి నిర్ణయం

Sub Editor

Leave a Comment