విద్యలనగరమైన విజయనగరం కు స్వాతంత్ర్య సమరయోధులు కాలు మోపిన ఊరు. గాంధీ తో పాటు టంగుటూరి ప్రకాశం పంతులు పాదం మోపిన నాటి ఊరు… నేటి ఈ ఆధునిక స్మార్ట్ యుగంలో వేగంతో పాటు.. నాటి గుర్తులను ప్రస్తుతం తరం వారికి అందివ్వాలన్న ఉద్దేశ్యం మంచిదైన…
కాస్త దూకుడు కారణం గా కాలు మోపి పార్క్ గా రూపాంతరం చెందిన ప్రకాశం పంతులు గారి పార్క్ కు అదనంగా మహిళా అని నామకరణం పెట్టి… కేవలం ఆడవాళ్లకే ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ప్రభుత్వం. .ఈ మహిళా పార్క్ ఓపెనింగ్ ను రాష్ట్ర మహిళా మంత్రి ఓపెన్ చేయించి… డిప్యూటీ స్పీకర్ తనకు విజయనగరం లో ఉన్న ప్రాధాన్యత ను చెప్పకనే చెప్పించారు.
కానీ ఆదరబాదరగా ప్రకారం పంతులు గారి మహిళా పార్క్ ను అట్టహాసంగా ప్రారంభించి మనుగడలోకి తెచ్చిన రెండు రోజుల్లో నే..పేర్లలో అక్షరాలు లేకపోవడం “సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి కి చిక్కడం జరిగింది. పర్యవసనంగా… ప్రకాశం లో “శ” పార్క్ అనే ఆంగ్లంలో కేవలం “ఆర్.” అన్న అక్షరాలే ఉండటం “సత్యం న్యూస్.నెట్” కెమారాలు చిక్కింది.
కాగా ప్రతీ రోజూ మహిళా పార్క్ ఉంటుందని ఆశతో. 17వ తేదీన సాయంత్రం వచ్చిన మహిళలు, చిన్నారులకు నిరాశే మిగిలింది. ప్రతీ బుధవారం మహిళా పార్క్ కు సెలవని..మహిళా పార్క్ గేట్ వేసి లోపల నుంచీ ఓ మగ సెక్యూరిటీ చెప్పడం విశేషం. మరి జగన్ ప్రభుత్వం… మహిళ ల పట్ల… పార్క్ ల అభివృద్ధి పట్ల చూపుతున్న ,చూపిస్తున్న “శ్రధ్ద” అంటే ఇదేనేమో…